For Money

Business News

ఆదిత్యా చేతికి చిక్కిన మసాబా

ప్రముఖ డిజైనర్‌ మిసాబా గుప్తా యాజమాన్యంలోని మసాబాలో మెజారిటీ వాటాను ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు మసాబా లైఫ్‌స్టైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. డీల్‌ విలువ రూ.90 కోట్లు. మొత్తం నగదు రూపంలో చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ డీల్‌పై రెండు కంపెనీలు సంతకాల చేశాయి. బ్రాండెడ్‌ బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ రంగంలోకి మరింతగా దూసుకెళ్ళడానికి ఈ డీల్‌ ఉపయోగపడుతుందని ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రీటైల్‌ అంటోంది. డైరెక్ట్‌ టు కన్జూమర్‌ (D2C) విభాగంలో ఈ బ్రాండ్‌ మరింత ముందుకు తీసుకెళతామని కంపెనీ పేర్కొంది. రానున్న అయిదేళ్ళలో ఈ బ్రాండ్‌ ద్వారా రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని ఆదిత్య గ్రూప్‌ లక్ష్యంగా నిర్ణయించింది.