For Money

Business News

రిలయన్స్‌ భారీ బాండ్‌ ఇష్యూ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గురువారం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000 కోట్ల)ను విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా సమీకరించింది. బాండ్ల ద్వారా ఇంత మొత్తాన్ని భారత కంపెనీ సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నిధులను ప్రస్తుత రుణాలను తీర్చడానికి కంపెనీ ఉపయోగించనుంది. ఫిబ్రవరిలో కట్టాల్సిన 1.5 బిలియన్‌ డాలర్ల రుణంతో పాటు మరికొన్ని రుణాలను వీటితో తీర్చనుంది. ‘ఇష్యూకు 3 రెట్ల స్పందన వచ్చింది. 1150 కోట్ల డాలర్లకు గిరాకీ లభించింద’ని కంపెనీ పేర్కొంది. 2014లో ఓఎన్‌జీసీ విదేశ్‌ అమెరికా డాలర్ల బాండ్లను జారీ చేసి, సమీకరించిన 2.2 బిలియన్‌ డాలర్లే ఇప్పటిదాకా అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్ల లావాదేవీగా ఉంది.