For Money

Business News

2022లో రూ.2 లక్షల కోట్ల ఐపీఓలు

కొత్త సంవత్సరంలోనూ పబ్లిక్‌ ఆఫర్ల హవా కొనసాగతనుంది. 2022లో సుమారు రూ.2 లక్షల కోట్ల సమీకరణకు వివిధ కంపెనీలు రెడీ అవుతున్నట్లు కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ నివేదిక పేర్కొంది. ఇందులో సెబీ ఆమోదం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కంపెనీల ఐపీఓల రూ.1,12,500 కోట్లు కాగా, సెబీకి దరఖాస్తు చేసేందుకు సన్నద్ధమవుతున్న కంపెనీల ఐపీఓల విలువ రూ.82,500 కోట్లు అని తెలిపింది. 2022లో కొత్త సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి, స్పెషాలిటీ రసాయనాల విభాగంలోని కంపెనీలు ఎక్కువగా పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే అవకాశం ఉంది