For Money

Business News

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ప్రిపరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.337.50 కోట్ల సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణభారాన్ని తగ్గించుకోవడం, నిధులను సమకూర్చుకునే వ్యూహంలో భాగంగా ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని, తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు ఇంటరప్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ ఆసక్తి చూపుతోందని తెలిపింది.