For Money

Business News

హైదరాబాద్‌లో ఫార్మ్‌ఈజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

దేశంలో అతిపెద్ద డిజిటల్‌ హెల్త్‌కేర్‌ బ్రాండ్‌ ఫార్మ్‌ఈజీ హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు పుణె, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో కూడా డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనటున్నట్లు ఫార్మ్‌ఈజీ సీఈఓ అభినవ్‌ యజుర్వేది తెలిపారు. నిపుణుల నియామక ప్రక్రియను చేపట్టామని, ఈ కేంద్రాల్లో మొత్తం 200 మంది నిపుణులను నియమించుకోనున్నామని అన్నారు. కంపెనీలో ప్రస్తుతం 6,100 మంది ఉద్యోగులున్నారు. కొత్తగా ప్రారంభించే డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో హైబ్రిడ్‌ మోడల్‌ను అనుసరించనున్నారు.