For Money

Business News

టీసీఎస్‌ ‘రీబిగిన్‌’

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ భారీ సంఖ్యలో మహిళా ఉద్యోగులను చేర్చుకోవాలని యోచిస్తోంది. దీని కోసం ‘రీబిగిన్‌ ప్రాజెక్టు’ పేరుతో ప్రత్యేక నియామకాలు చేపట్టింది. వరుసగా రెండేళ్లు కంపెనీలో పని చేసి గుడ్‌బై చెప్పిన మహిళా ఉద్యోగులను మళ్లీ ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగాల్లో చేర్చుకోవాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత మందిని చేర్చుకునేదీ టీసీఎస్‌ వెల్లడించలేదు. ప్రస్తుతం టీసీఎస్‌లో పని చేస్తున్న 5లక్షల మంది ఉద్యోగుల్లో 36.2 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. రీబిగిన్‌ ప్రాజెక్టు ద్వారా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే మహిళా ఉద్యోగులు చేరే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.