For Money

Business News

మార్చికల్లా ఎగరనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌

జెట్‌ ఎయిర్‌వేస్ మళ్ళీ రన్‌వేపైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. వచ్చే మార్చికల్లా జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ ఎగరనున్నాయని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం ఇవాళ వెల్లడించింది. ఢిల్లీ-ముంబై మార్గంలో తొలి విమానాన్ని నడపనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో తక్కువ దూరం ఉండే అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కన్సార్షియం పేర్కొంది. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలనుకుంటున్నామని కన్సార్షియం లీడ్‌ మెంబర్‌ మురళీ లాల్‌ జలాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. రుణభారంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019 ఏప్రిల్‌లో మూతబడిన విషయం తెలిసిందే.