For Money

Business News

అదానీ కంపెనీకి సెబి నోటీసు

అదానీ గ్రూప్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ అయిన అదానీ ఎనర్జి సొల్యూషన్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి షోకాజు నోటీసు జారీ అయింది. కంపెనీ వాటాదారుల్లో కొంత మందిని మరో కేటగిరిలో తప్పుగా ఎందుకు చూపారంటూ కంపెనీకి షోకాజ్‌ నోటీసు జారీ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని సెబీ నుంచి నోటీసు వచ్చినట్లు అదానీ ఎనర్జీ వర్గాలు తెలిపాయి. కొంత మంది ఇన్వెస్టర్లను తప్పుడు పద్ధతిలో కేటగిరీ మార్చి పబ్లిక్‌ షేర్‌ హోల్డర్స్‌గా చూపినట్లు సెబీ తన నోటీసులో పేర్కొంది.

Leave a Reply