For Money

Business News

22,23 తేదీల్లో డ్రోన్‌ సమ్మిట్‌

ఈ నెల 22,23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్​-2024 నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, ఏపీ ప్రభుత్వ సాయంతో ఏపీ డ్రోన్ కార్పోరేషన్ ఈ జాతీయ సెమినార్‌ను నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్​లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరగనుంది. అలాగే పున్నమిఘాట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్పన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తుత్పత్తి రంగాల్లో వినియోగిస్తున్న డ్రోన్లను ఈ ఎక్స్‌పో ప్రదర్శించనున్నారు. దేశంలోని వివిధా నగరాలకు చెందిన సుమారు 1200 ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరు కానున్నారు. ఎగ్జిబిషన్‌లో 40కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగం పెంచడం లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నారు.

https://x.com/ncbn/status/1846519611329757365

 

Leave a Reply