For Money

Business News

ఐటీ పోర్టల్‌ రెడీ : ఇన్ఫోసిస్‌

గత శనివారం నుంచి కొత్త ఐటీ పోర్టల్‌ www.incometax.gov.in పనిచేయడం లేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆర్థికశాఖ ఇన్ఫోసిస్‌కు సమన్లు జారీ చేసింది. కంపెనీ సీఈఓను ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవాల్సిందిగా సమన్లు జారీ చేసింది. సాంకేతిక కారణాల వల్ల పని చేయకుండా పోయిన ఈ వెబ్‌సైట్‌ ఇపుడు రిటర్న్‌ల దాఖలుకు సిద్ధంగా ఉందని ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఈ పోర్టల్‌ ప్రారంభమైన రోజు నుంచి అంటే జూన్‌ ఏడో తేదీ నుంచే సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పోర్టల్‌లోని కొన్ని విభాగాలు పని చేయడంలేదని ఫిర్యాదులు వచ్చాయి.