For Money

Business News

ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత?

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై ఇపుడు ఉన్న ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్‌ చోప్రా వెల్లడించారు. ఆంక్షలు ఎత్తివేసే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చౌక ధర ఉన్న బాస్మతీ బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. గత ఏడాది జులై 20వ తేదీన బియ్యంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే నూకలపై 20 వాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలను కట్టడి చేసేందుకు అపుడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇపుడు తమ వద్ద సమృద్దిగా నిల్వలు ఉన్నాయని … తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని సంజీవ్‌ చోప్రా తెలిపారు. దేశీయ మార్కెట్లలో కూడా బియ్యం ధరలు నియంత్రణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Leave a Reply