రేపు ఐఎస్బీకి చంద్రబాబు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఐఎస్బీ ఆవిర్భావ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు టీడీపీ అధినేత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన ఐఎస్బీ విద్యార్థులతో ముఖాముఖీ చర్చలో పాల్గొననున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు హైదరాబాద్లో ఐఎస్బీ ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేసిన విషయం తెలిసిందే. అనేక రాష్ట్రాలు పోటీ పడినా ఈ ప్రతిష్టాత్మక సంస్థను నాడు రాష్ట్రానికి చంద్రబాబు తీసుకువచ్చారు. 2001లో నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయి ఐఎస్బీని ప్రారంభించారు.