For Money

Business News

పరిశ్రమలకు 50 శాతం విద్యుత్‌ కోత

విద్యుత్‌ కోతలతో ఆంధ్రప్రదేశ్‌ అల్లాడి పోతుంది. ఎపుడు కరెంటు వస్తుందో…ఎపుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు 50శాతం కోత విధిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఒక రోజు పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా ఆపేస్తారు. అంటే పవర్‌ హాలిడే అన్నమాట. రెండు వారాల పాటు విద్యుత్‌ కోత అమల్లో ఉంటుందని అధికారుల తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీన 235 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్‌ నుంచి 64 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. గత రెండేళ్ళతో పాటు పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అంటున్నారు. కోవిడ్‌ తరవాత అనేక పరిశ్రమలు పని చేయడం ప్రారంభించాయని… దీంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అంటున్నారు. అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా… ఇంకా రోజుకు ఇంకా 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడుతోందని ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిటక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నారు.