For Money

Business News

4న మార్కెట్‌లోకి హ్యుందాయ్ టక్సన్

దక్షిణ కొరియా ఆటో సంస్థ హ్యుందాయ్ ఇవాళ టక్సన్ 2022ని కొత్త డిజైన్‌తో ఇండియన్‌ మార్కెట్‌కు పరిచయం చేసింది. న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ ఆగస్ట్ 4న మన దేశంలో విడుదల చేయనున్నారు. హ్యుందాయ్ టక్సన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, దాదాపు రూ. 23 లక్షలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మన దేశంలో ఎస్‌యూవీ మార్కెట్లో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, ఇతర మోడళ్లతో టక్సన్‌ పోటీపడనుంది. ఎస్‌యూవీ కార్‌ లవర్స్‌ కోసం 2022 హ్యుందాయ్ టక్సన్ పోలరైజింగ్ డిజైన్, AWD, ADAS లాంటి ఫీచర్లు జోడించింది. హ్యుందాయ్‌లో బెస్ట్‌ ఎస్‌యూవీగా ఉన్న ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC/VSM, హిల్ స్టార్ట్-స్టాప్ అసిస్ట్, లెవల్ 2 ADAS సూట్ వంటి 60 ప్లస్ సేఫ్టీ ఫీచర్‌, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ , డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ లాంటి అనేక ఫీచర్లతో హ్యుందాయ్ టక్సన్ వస్తోంది.