16 కోట్ల పారాసిటమాల్ మాత్రలు
దేశమంతటా కరోనా విజృంభిస్తోంది. కరోనా చికిత్సలో భాగంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్లను డాక్టర్లు వాడుతున్నారు. ఈ ట్యాబ్లెట్ల తయారీలో ప్రముఖ కంపెనీ అయిన గ్రాన్యూయాల్స్ ఇండియా తన వంతు సాయంగా ఈ ట్యాబ్లెట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. వారానికి ఒక కోటి మాత్రలను (500 ఎంజీ) రాష్ట్రానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమాదేవి చిగురుపాటి వెల్లడించారు. మే 12వ తేదీ నుంచి రానున్న నాలుగు నెలల పాటు ఇస్తామని పేర్కొన్నారు. ఇలా 16 కోట్ల మాత్రలను కంపెనీ ఉచితంగా రాష్ట్రానికి అందిస్తుందని పేర్కొన్నారు.