For Money

Business News

జీ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందిన స్టాక్ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) తేల్చింది. ఈ లావాదేవీలు జరిపిన 15 కంపెనీలు/ వ్యక్తులను స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ జరగకుండా నిషేధించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వల్ల ఈ కంపెనీలు రూ.23.84 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ తేల్చింది.2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి ముందు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సెబీ గుర్తించింది. 2020 ఆగస్టు 18న ట్రేడింగ్‌ పూర్తయిన తరవాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. 19వ తేదీన ఈ కంపెనీ షేర్‌ 13 శాతంపైగా పెరిగింది. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న సంబంధిత కంపెనీలు ఫలితాల ప్రకటనకు ముందు పొజిషన్స్‌ తీసుకున్నట్లు సెబీ గుర్తించింది. ఫలితాలకు ముందు కొని, ఆ తరవాత వెంటనే షేర్లను అమ్మినట్లు గుర్తించింది.
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన కంపెనీలు/వ్యక్తులు…

1.బిజాల్ షా

2. గోపాల్ రిటోలియా

3. జతిన్ చావ్లా

4. అమిత్ భన్వర్‌లాల్ జాజూ

5. మనీష్ కుమార్ జాజూ

6. గోమతి దేవి రిటోలియా

7. దల్జిత్ గురుచరణ్ చావ్లా

8 మోనికా లఖోటియా

9 పుష్పాదేవి జాజూ

10 భవార్‌లాల్ రాంనివాస్ జాజూ

11 భవార్‌లాల్ జాజూ HUF

12 రితేష్ కుమార్ కమల్‌కిషోర్ జాజూ 13 సక్సెస్‌ష్యూర్‌ పార్ట్‌నర్స్‌

14 యాష్ అనిల్ జాజూ

15 విమల సోమాని