For Money

Business News

లాభాలతో లిస్ట్‌ కానున్న కిమ్స్‌, దొడ్ల

దొడ్ల డెయిరీతో పాటు కిమ్స్‌ హాస్పిటల్స్‌ రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ కానున్నాయి. ఈ రెండు షేర్ల అలాట్‌మెంట్‌ గత వారం పూర్తయింది. రెండు షేర్లు ప్రీమియంతో లిస్ట్‌ అవుతాయని స్టాక్‌ బ్రోకర్లు భావిస్తున్నారు. ఈ రెండు షేర్ల ఇష్యూలు ఓపెన్‌ అయినపుడు మార్కెట్‌ వీక్‌గా ఉంది. ఇపుడు మార్కెట్‌లో ఆకర్షణీయ లాభాలతో ఉంది. కాబట్టి కిమ్స్‌, దొడ్ల డెయిరీ రెండింటికీ… గ్రే మార్కెట్‌ (అనధికార మార్కెట్‌)లో మంచి ప్రీమియం పలుకుతోంది. కిమ్స్ హాస్పిటల్‌ ఇష్యూ ధర రూ 825 కాగా, గ్రే మార్కెట్‌ రూ. 935 పలుకుతోంది. అలాగే దొడ్ల డెయిరీ షేర్‌ ఇష్యూ ధర రూ. 428 కాగా రూ. 523 వద్ద గ్రేమార్కెట్‌లో లభిస్తోంది. వాస్తవానికి దొడ్ల డెయిరీ ఆర్థికపరంగా పటిష్ఠంగా ఉన్నా… డెయిరీ రంగానికి చెందిన షేర్లకు మార్కెట్‌ అట్రాక్షన్‌ ఉండదు. అందుకే తక్కువ ప్రీమియం లభిస్తోందని బ్రోకర్లు అంటున్నారు. ఇదంతా గ్రేమార్కెట్‌ ప్రీమియం… వాస్తవంగా ఎంత లాభంతో రేపు ఈ షేర్లలో ట్రేడింగ్‌ మొదలవుతుందో చూడాలి.