పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మొన్ననే బ్యారల్ క్రూడ్ ధర 70 డాలర్లకు చేరగా, కేవలం మూడు రోజుల్లో 64 డాలర్లకు పడిపోయింది. అంటే పది శాతం వరకు క్షీణించింది. డాలర్ కూడా ఇదే సమయంలో భారీగా క్షీణించింది. కాని మనదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇంకా పెంచుతూనే ఉన్నారు. ఇవాళ పెట్రోల్ రేటును 19 పైసలు పెంచగా, డీజిల్ ధరను 29పైసలు చొప్పున పెంచారు. అనేక నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. ముంబైలో పెట్రోల్ ధర రూ.99.32కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 91.01కు చేరింది.