For Money

Business News

పెట్రో ధరలు పెంపు…

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌ ధరను 23 పైసలు చొప్పున, డీజిల్‌ ధర 27పైసలు చొప్పున పెంచాయి. గత కొన్ని రోజులుగా కంపెనీలు డీజిల్‌ ధరలు భారీగా పెంచుతున్నాయి. తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్‌ ధర రూ.100లకు దగ్గరయింది. ఇవాళ్టి పెంపుతో పెట్రోల్‌ ధర రూ. 99.71 కాగా, డీజిల్‌ ధర రూ. 91.57కు చేరింది. అనేక రాష్ట్రాల్లో వ్యాట్‌ భిన్నంగా ఉండటంతో ధరలు ఇంకా అధికంగా ఉండే అవకాశముంది. అనేక రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100 దాటింది.