ఎల్ఐసీ ఐపీఓకు సెబి అనుమతి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పబ్లిక్ ఆఫర్కు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన సెబి వద్ద ఎల్ఐసీ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇంత వేగంగా ఓ పబ్లిక్ ఆఫర్కు సెబీ అనుమతి లభించడం ఇదే మొదటిసారి. పబ్లిక్ ఆఫర్ కింద ప్రభుత్వం 31 కోట్ల షేర్లను అమ్ముతుండగా, ఇందులో పది శాతం షేర్లను పాలసీదారులకు కేటాయించారు. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా కనీసం రూ.63,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో షేర్ ముఖవిలువ రూ.10 కాగా, ఆఫర్ ధర ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. అలాగే మార్కెట్లో పరిస్థితి ప్రతికూలంగా ఉన్నందున పబ్లిక్ ఆఫర్ ఈ నెలలో ఉండదని భావిస్తున్నారు.
