ఇవాళ మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాల కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. పెట్రోల్ లీటర్ ధర 31 పైసలు, డీజిల్ ధర 28 పైసలు చొప్పన పెంచాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో ఇప్పటికి నాలుగు సార్లు పెట్రో ధరలు పెంచారు. దీంతో ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 101.52కు చేరగా, డీజిల్ ధర 95.28కి చేరింది.