For Money

Business News

అక్రమ ఆదాయం రూ.550 కోట్లు

హైదరాబాద్‌లోని హెటిరో డ్రగ్స్‌పై ఐటీ అధికారులు చేసిన దాడుల్లో రూ. 550 కోట్ల అక్రమ ఆదాయం ఇప్పటి వరకు బయటపడింది. ఈ విషయాన్ని ఐటీ విభాగం వెల్లడించింది. అయితే అందులో ఎప్పటిలాగే కంపెనీ పేరు మాత్రం పేర్కొనలేదు. అలాగే రూ. 142.87 కోట్ల నగదును జప్తు చేశామని, దీనికి సంబంధించిన లెక్కలను కంపెనీ చెప్పడం లేదని ఐటీ విభాగం వెల్లడించింది. ఐటీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. ఇంకా బ్యాంకుల్లో ఉన్న లాకర్లు ఉన్నట్లు గుర్తించామని, వీటిలో 16 లాకర్లు ఆపరేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది.దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 50 లోకేషన్లలో కంపెనీ పనిచేస్తోందని, వాటిని తాము సోదా చేస్తున్నట్లు ఐటీ విభాగం వెల్లడించింది.