లిస్టింగ్ ధరకు దిగువన జొమాటొ
ఇప్పటి వరకు మార్కెట్లో పేటీఎం షేర్ను చూసి జనం ఎగతాళి చేసేవారు. జొమాటో అద్భుతమని లిస్టింగ్ తరవాత షేర్ రూ. 169ని తాకింది. ఈ షేర్ను రూ.115లకు కంపెనీ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. అందరూ పేటీఎం పడిపోతోందని… ఆ కౌంటర్ను గమనించారు. కాని జొమాటొ కూడా గత నాలుగు సెషన్స్లో క్షీణిస్తూ వచ్చింది. ఇవాళ ఏకంగా పది శాతం క్షీణించి ఎన్ఎస్ఈలో రూ. 112.55కు పడిపోయింది. ఇక బీఎస్ఈలో రూ.113.15ని తాకింది. దిగువ స్థాయిలో కూడా జొమాటొకు మద్దతు లభిచంలేదు. నష్టాల్లో కంపెనీల నుంచి ఇన్వెస్టర్లు మెలమెల్లగా వైదొలగుతున్నట్లు కన్పిస్తోంది. జొమాటోతో పాటు పేటీఎం, పీబీ ఫిన్టెక్, కార్ట్రేడ్ షేర్లు కూడా నష్టాలతో ముగిశాయి.