For Money

Business News

రూ. 100లకూ గోల్డ్‌ కొనొచ్చు..!

కరోనా సమయంలో బంగారం కొనుగోళ్ళు భారీగా పడిపోవడం జ్యువలరీ కంపెనీలు తెచ్చిన కొత్త స్కీమ్‌ ఇది. ఆన్‌లైన్‌ మీరు రూ., 100లకు బంగారం కొటూ పోవచ్చు. ఆ తరవాత ఇష్టమైనపుడు దానికి సరిపడా బంగారం కొనుగోలు చేయొచ్చు. అయితే కనీసం ఒక గ్రాముకు సరిపడా మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి స్కీమును టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్‌ జ్వువెలరీ కంపెనీలు ఇస్తున్నాయి. కంపెనీ వెబ్‌సైట్లలో లేదా ఇతర థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా ఈ ఆఫర్‌లను ప్రారంభించాయి. దసరా, ధంతేరాస్‌, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు జ్యువెలరీ షాపు యజమానులు అంటున్నారు.