For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఈ రెండు షేర్లు

మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు షేర్లను ఎస్ సెక్యూరిటీస్‌కి చెందిన అమిత్ త్రివేదీ… ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం ప్రతిపాదించారు. ఒకటి ఏషియన్‌ పెయింట్స్‌ కాగా రెండోది గోద్రేజ్‌ కన్జూమర్స్‌.
ఏషియన్ పెయింట్స్ ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ను రూ.3140-3150 ప్రాంతంలో అమ్మమని సలహా ఇస్తున్నారు. ఆయన పేర్కొన్న టార్గెట్ రూ.2940. రూ.3250 స్టాప్‌లాస్‌గా పేర్కొన్నారు.
ఈ స్టాక్‌లో మల్టీ మంత్ అప్‌ట్రెండ్ వద్ద కొనసాగుతోంది.అయితే వెంటనే రూ.3250 వద్ద ఈ షేర్‌కు ప్రతిఘటన ఎదురవుతున్నట్లు కన్పిస్తోందని, ఈ స్థాయిని దాటకపోతే షేర్‌ రూ.2900 స్థాయి వరకు పడే అవకాశముందని అమిత్‌ త్రేవేది అంటున్నారు. క్రూడ్‌ ఆయిల్ ధరలు నాన్‌ స్టాప్‌గా పెరుగుతుండటం.. పెయింట్స్‌ షేర్లకు పెద్ద ప్రతికూల అంశం.
గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ షేర్‌ను రూ.710-715 ప్రాంతంలో కొనుగోలు చేయాల్సిందిగా సిఫారసు చేస్తున్నారు. ఆయన ఇస్తున్న టార్గెట్‌
రూ.765 కాగా స్టాప్‌లాస్‌ రూ.690గా పేర్కొంటున్నారు. ఈ షేర్‌ గత కొన్ని సెషన్స్‌లో గరిష్ఠ స్థాయి నుంచి 24 శాతం పతనమైంది. ఇపుడు ఈ షేర్‌లో షార్ట్‌టైమ్‌ బౌన్స్‌ కన్పిస్తోంది.