For Money

Business News

టెక్నో పెయింట్స్‌ కొత్త యూనిట్‌

హైదరాబాద్‌కు చెందిన టెక్నో పెయింట్స్‌ రూ.75 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకంగా సూపర్‌ ప్రీమియం పెయింట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణాలోని చేర్యాల వద్ద ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రమోటర్‌ అయిన ఆకూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీని కోసం ఇటలీకి చెందిన కంపెనీతో సాంకేతిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. కొత్త ప్లాంటుతో సూపర్‌ ప్రీమియం పెయింట్లు తయారు చేయగలుగుతామన్నారు.. కొత్త యూనిట్‌కు తొలి దశలో 1.5 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. రెండో దశలో అదనంగా 50,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం లభిస్తుంది. తొలిసారిగా ఈ తరహా రంగులను టెక్నో పెయింట్స్‌ దేశీయంగా ఉత్పత్తి చేయనుంది.