For Money

Business News

తగ్గిన టెక్‌ మహీంద్రా లాభం

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా కంపెనీ రూ.1285 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 4 శాతం తగ్గింది. అయితే ఆదాయం మాత్రం 20 శాతం పెరిగి రూ. 13,129.50 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 10.881 కోట్లు. ఈ ఏడాది జూన్ తో ముగిసిన మొదటి త్రైమాసికంతో పోల్చితే టెక్ మహీంద్రా లాభం 13.6 శాతం పెరిగింది. ఒక్కో షేరుకు రూ. 18 ప్రత్యేక డివిడెంట్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది.