For Money

Business News

టెక్‌ మహీంద్రా చేతికి మరో కంపెనీ

టెక్ మహీంద్రా యూరోప్‌కు చెందిన Com Tec Co IT (CTC)లో 100 శాతం వాటా సొంతం చేసుకుంది. దీంతో పాటు రెండు ఐటి ప్లాట్‌ఫారమ్‌లలో 25 శాతం వాటాను 33 కోట్ల యూరోలకు కొనుగోలు చేసింది. మన కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 2,800 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్స్‌తో తమ డిజిటల్ ఇంజనీరింగ్, ఇన్సూరెన్స్ టెక్నాలజీ వ్యాపారాలు మరింత బలోపేతం అవుతాయని కంపెనీ తెలిపింది. Com Tec Co IT (CTC)కి చెందిన SWFT మరియు Surance ప్లాట్‌ఫారమ్‌లలో కూడా 25 శాతం యాజమాన్యాన్ని టెక్ మహీంద్రా పొందుతుంది. లండన్‌లోని తమ వంద శాతం అనుబంధ సంస్థ టెక్‌ మహీంద్రా లండన్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ డీల్‌ను ఓకే చేశారు.