For Money

Business News

39% పెరిగిన టెక్‌ మహీంద్రా లాభం

జూన్‌ త్రైమాసికంలో రూ.1,353.2 కోట్ల నికర లాభాన్ని టెక్‌ మహీంద్రా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.972.3 కోట్లతో పోలిస్తే ఇది 39.2 శాతం అధికం. ఆదాయం కూడా రూ.9,106.3 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.10,197.6 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్‌లో 5,029 మంది కొత్త ఉద్యోగులు చేరారు. దీంతో కంపెనీల ఉద్యోగుల సంఖ్య 1,26,263కు చేరారు. 2021 జూన్‌ 30 నాటికి కంపెనీ వద్ద నగదు నిల్వలు 1,81 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.