For Money

Business News

సీఎం జగన్‌తో టాటా సన్స్‌ ఛైర్మన్‌ భేటీ

టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా… అందించడానికి సిద్దంగా ఉన్నట్లు సీఎం జగన్‌ హామి ఇచ్చారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పారిశ్రామిక విధానాలతో పాటు ఇతర పారదర్శక విధానాల గురించి చంద్రశేఖరన్‌కు సీఎం వివరించారు.