For Money

Business News

టాటాల చేతికి ఫోర్డ్‌ ప్లాంట్‌

ఫోర్డ్ ఇండియా ప్యాసింజర్ కార్ల తయారీ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్ వద్ద ఫోర్డ్‌ ప్లాంట్‌ ఉంది. ఫోర్డ్‌ కంపెనీ భారత్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 750 కోట్లకు టాటా, ఫోర్డ్‌ల మధ్య డీల్‌ కుదిరినట్లు తలుస్తోంది. రెండు కంపెనీల మధ్య ఒప్పందానికి గుజరాత్ కేబినెట్‌ ఇది వరకే ఆమోదించింది. కంపెనీల ప్రతిపాదనపై కేబినెట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది. ఫోర్డ్‌ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు చెందిన ఈవీ విభాగం కొనుగోలు చేయనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలను ఈ ఏడాది 50000లకు పెంచాలని టాటా మోటార్స్‌ నిర్ణయించింది. ఫోర్డ్‌ ప్లాంట్‌ చేతికి అందితే… వెంటనే ఉత్పత్తిని పెంచే అవకాశముంది.