For Money

Business News

రాణించిన సన్‌ ఫార్మా

డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా అంచనాలను మించిన లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 11.13శాతం పెరిగి రూ.2,058.80 కోట్లకు చేరింది. గత ఏడాది కాలంలో కంపెనీ నికర లాభం రూ.1852.48 కోట్లు.
కంపెనీ ఆదాయం కూడా 11.61 శాతం వృద్ధితో రూ.8836.78కోట్ల నుంచి రూ.9863.06 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.7ల మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్‌ ఫిబ్రవరి 10. కంపెనీ మంచి పనితీరు కనబర్చడంతో షేర్‌ 2.7 శాతం పెరిగి రూ. 849.5లకు చేరింది. కంపెనీ 52 వారాల గరిష్ఠ ధర రూ.871ని క్రాస్‌ చేయడానికి షేర్‌ రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది.