For Money

Business News

ధామ్‌పూర్‌… 20శాతం అప్‌…ఎందుకు?

గత కొన్ని సంవత్సరాలుగా చాలా డల్‌గా అనిశ్చితిలో ఉన్న సుగర్‌ షేర్లు ఇటీవలి కాలంలో చాలా బలంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్‌ ధరలు భారీగా పెరగడం… వెంటనే ఎథనాల్‌కు డిమాండ్‌ పెరగడంతో అనేక చక్కెర కంపెనీలు భారీ లాభాలు గడించాయి. ఈ షేర్లలో ధామ్‌పూర్ సుగర్‌ ఇటీవల చాలా హాట్‌ టాపిక్‌గా మారింది. రూ.300పైన ఈ షేర్‌ను చాలా మంది అనలిస్టులు రెకమెండ్‌ చేశారు. నిన్న ఈ షేర్‌ 20 శాతం అప్పర సర్క్యూట్‌తో ముగిసింది. అమెరికాకు చెందిన OPSRP అనే పెన్షన్‌ ఫండ్‌ నిన్న రూ. 492.26 వద్ద 4,62,371 షేర్లను కొనుగోలు చేసింది. ధామ్‌పూర్ సుగర్‌ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ వరిందర్‌ బన్సల్‌ వివరణ ఈ వీడియోలో పరిశీలించండి.