For Money

Business News

రేపు స్పెషల్‌ ట్రేడింగ్‌

శనివారం స్టాక్‌మార్కెట్లలో స్పెషల్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. చెన్నైలోని ఎమర్జన్సీ సెంటర్‌ నుంచి ఈ ట్రేడింగ్‌ నిర్వహిస్తారు. అనూహ్య పరిస్థితుల్లో ట్రేడింగ్‌కు ఆటంకం కల్గకుండా ఉండేందుకు ప్రత్యేక సర్వర్‌ను చైన్నైలో ఏర్పాటు చేశారు. అపుడపుడు ఈ సెంటర్‌ను టెస్టింగ్‌ చేసేందుకు ప్రత్యేక ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి సెషన్‌ ఉంటుంది. విరామం తరవాత మరో సెషన్‌ ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఎఫ్‌ అండ్‌ ఓ సెషన్‌లో కూడా ట్రేడింగ్‌ ఉంటుంది. అయితే గరిష్ఠ ప్రైస్‌బాండ్‌ను 5 శాతంగా నిర్ణయించారు.