For Money

Business News

రాణించిన ఎల్‌టీ ఫుడ్స్‌

దావత్‌ బ్రాండ్‌తో బాస్మతి రైస్‌ను విక్రయించే ఎల్‌టీ ఫుడ్స్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 2094 కోట్ల టర్నోవర్‌పై రూ. 150 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది కాలంలో రూ. 1834 కోట్ల ఆదాయంపై రూ.131 కోట్ల నికర లాభం ఆర్జించింది. పూర్తి ఏడాది కంపెనీ నికర లాభం 41 శాతం పెరిగి రూ. 597 కోట్లకు చేరింది. కంపెనీ మార్జిన్‌ కూడా 10.8 శాతం నుంచి రూ. 11.8 శాతానికి పెరిగినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ అశ్విని అరోరా తెలిపారు.