For Money

Business News

వెండిలో కొనసాగుతున్న ర్యాలీ

గత కొన్ని రోజులుగా ఏడాది గరిష్ఠ స్థాయిలో ట్రేడైన డాలర్‌ ఇపుడు చల్లబడింది. దీంతో బులియన్‌ క్రమంగా బలపడింది. బంగారం 1756 డాలర్ల నుంచి 1795 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. కాని వెండిలో భారీ ర్యాలీ కన్పిస్తోంది. బంగారం స్థిరంగా ఉన్నా వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి రెండు శాతం దాకా పెరిగింది. ఎంసీఎక్స్‌లో కిలో విండో డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ.692 పెరిగి రూ.63,579 వద్ద ట్రేడవుతోంది. నవంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 669 పెరిగి రూ.63,740 వద్ద ట్రేడవుతోంది.