For Money

Business News

రూ.7460 కోట్లకు డెల్హివరీ ఐపీఓ

ఢిల్లీకి చెందిన డెల్హివరీ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. మార్కెట్‌ నుంచి రూ. 7460 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఇష్యూకు సెబీ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. గుర్‌గావ్‌కు చెందిన ఈ కొత్త తరం లాజిస్టిక్‌ కంపెనీ రూ. 5000 కోట్లను కొత్త షేర్లు జారీ చేయడం ద్వారా సమీకరిస్తుంది. మిగిలిన రూ. 2400 కోట్లవిలువైన షేర్లను ఇపుడున్న ఇన్వెస్టర్లు అమ్ముతారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌, టైమ్స్‌ ఇంటర్‌నెట్‌ కార్లిలే ఇపుడు కంపెనీలో ఇన్వెస్టర్లుగా ఉన్నారు.