For Money

Business News

సీనియర్‌ సిటిజన్లకు SBI గుడ్‌న్యూస్‌..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఎస్‌బీఐ వీ కేర్‌ను అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం 2020 మేలో ఎస్‌బీఐ ఈ ట‌ర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ ప‌థ‌కం ద్వారా ఎస్‌బీఐ సీనియ‌ర్ సిటిజ‌న్లకు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 0.30 శాతం అధిక వ‌డ్డీ రేటు ఇస్తోంది. నిజానికి సీనియర్‌ సిటిజన్లకు సాధారణ ప్రజల కంటే 0. 50 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన ఈ పథకం వల్ల సీనియర్‌ సిటిజన్లకు సాధార‌ణ ప్రజ‌ల‌కు వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 0.80 శాతం అద‌న‌పు వ‌డ్డీ లభిస్తుందన్నమాట. తాజాగా ఈ ప‌థ‌కం గ‌డువును మ‌రోసారి పొడిగిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. తొలుత‌ 2020 సెప్టెంబ‌రు వ‌ర‌కు మాత్రమే ఈ ప‌థ‌కం అమ‌ల్లో ఉంటుందని చెప్పినా… తరవాత పొడిగిస్తూ వచ్చింది. తాజా పొడిగింపుతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగనుంది.