For Money

Business News

85 శాతం వెహికల్‌ లోన్‌

‘ఈజీ రైడ్‌’ పేరుతో ద్విచక్ర వాహన రుణాలను కనీసం రూ.20,000 నుంచి గరిష్ఠంగా రూ.3లక్షల వరకు అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్రి అప్రూవ్డ్‌ లోన్‌ మంజూరైన కస్టమర్లకు వాహన ఆన్‌-రోడ్‌ ధరలో 85% వరకు రుణం ఇస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. వార్షిక వడ్డీ 10.5%. నాలుగేళ్ల వ్యవధికి రుణం తీసుకోవచ్చు. 48 నెలల రుణానికి రూ.లక్షకు ఈఎంఐ రూ.2,560 ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. తమ యోనో యాప్‌పై ప్రి అప్రూవ్డ్‌ టూవీలర్‌ రుణాలు అందిస్తున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. ఆన్‌లైన్‌/యోనో ద్వారా దరఖాస్తు చేసినప్పుడు, గృహరుణ వడ్డీపై 0.05 శాతం రాయితీని ఇస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.