For Money

Business News

ఈ ఫోన్‌ ఖరీదు రూ.1.85 లక్షలు

సామ్‌సంగ్‌ నుంచి సూపర్‌ ఆప్షన్స్‌ ఉన్న 5జీ ఫోన్‌ రానుంది. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్ ‌4కు అడ్వాన్స్‌ బుకింగ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1.85 లక్షలు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,54,999గాను, 12జీబీ, 512 జీబీ మెమొరీ ధర రూ.1,64,999, అలాగే టాప్‌-ఎండ్‌ మోడల్‌ 12జీబీ, 1 టీబీ స్టోరేజ్‌ కలిగిన మోడల్‌ రూ.1,84,999గా నిర్ణయించింది. గెలాక్సీ జెడ్‌ఫోల్డ్‌ 4ని కొనుగోలు చేసిన వారికి రూ.34,999 విలువైన గెలాక్సీ వాచ్‌4 క్లాసిక్‌ స్మార్ట్‌వాచ్‌ను రూ.2,999కి అందిస్తోంది సామ్‌సంగ్‌.