For Money

Business News

రిలయన్స్‌ రీటైల్‌ చేతికి క్లోవియా

లోదుస్తుల తయారీ సంస్థ క్లోవియాలో 89 శాతం ఈక్విటీ వాటాను రూ. 950 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్‌వీఎల్) ప్రకటించింది. క్లోవియా వ్యాపారాలను నిర్వహించే పర్పుల్ పాండా ఫ్యాషన్స్‌ నుంచి ఈ శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కంపెనీలో మిగిలిన వాటా వ్యవస్థాపక బృందం, మేనేజ్మెంట్ చేతిలో ఉందని తెలిపింది. తాజా కొనుగోలుతో లోదుస్తుల విభాగంలో రిలయన్స్‌ రీటైల్‌ మరింత బలోపేతం కానుంది. . 2013లో క్లోవియాను పంకజ్ వెర్మానీ, నేహాకాంత్, సుమన్ చౌద్రీలు ప్రారంభించారు.