For Money

Business News

ఆ షేర్లకు రాకేష్‌ గుడ్‌బై

స్టార్‌ షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా రెండు ప్రధాన షేర్ల నుంచి వైదొలిగారు. ఎంసీఎక్స్‌తో పాటు లుపిన్‌ కంపెనీలలో తన పూర్తి వాటాను రాకేష్‌ అమ్మేసినట్లు తెలుస్తోంది. అలాగే మూడు షేర్లలో ఆయన తన వాటా తగ్గించుకున్నారు. మంధాన రీటైల్‌ వెంచర్స్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ TARC, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లలో తన వాటాను ఆయన బాగా తగ్గించుకున్నారు. ముఖ్యంగా మంధాన రీటైల్‌ వెంచర్స్‌లో ఆయన వాటా 12.74 శాతం నుంచి 7.39 శాతానికి తగ్గింది. ఇక ఇండయిన్‌ హోటల్స్‌, టాటా కమ్యూనికేషన్స్‌, మ్యాన్‌ ఇన్‌ఫ్రాకన్‌స్ట్రక్షన్‌, ఎన్‌సీసీ, ఓరియంట్‌ సిమెంట్‌, వోకార్డ్‌, ఆగ్రో టెక్‌ ఫుడ్స్‌లలో తన వాటాను కొనసాగించడమే గాక కెనరా బ్యాంక్‌, నాల్కోలలో తాజాగా షేర్లు కొన్నారు. టైటాన్‌, టాటా మోటార్స్‌, క్రిసిల్‌, ఎస్కార్ట్స్‌లలో కూడా రాకేష్‌కు వాటా ఉంది. అయితే తాజా డేటా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.