For Money

Business News

రెయిన్‌బో ప్రైస్‌ బాండ్‌ ఖరారు

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 27న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆఫర్‌ షేర్ల ధరల శ్రేణిని రూ.516 నుంచి రూ.542గా కంపెనీ నిర్ణయించింది. రూ.1,581 కోట్ల ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీవో) ఈ నెల 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఒక్కో ఇన్వెస్టర్‌ కనీసంగా 27 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ రమేశ్‌ మాట్లాడుతూ..వచ్చే మూడేళ్ళ కాలంలో హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో ఉన్న హాస్పిటల్స్‌లో కొత్తగా 500 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం రూ.300 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.ఐపీఓ నిధులతో పాటు కంపెనీ వద్ద రెడీ ఉన్న క్యాష్‌ను దీని కోసం ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి ఆరు నగరాల్లో 14 హాస్పిటల్స్‌, మూడు క్లినిక్స్‌లు ఉన్నాయి. మే 10 కంపెనీ షేర్లు లిస్టవుతాయి.