క్రిప్టోస్పై రఘురామ రాజన్ ఏమన్నారు?
భారత ప్రభుత్వం క్రిప్టో చట్టాలు తీసుకు వస్తున్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ స్పందించారు. సీఎన్బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ… అసలు ఈ కరెన్సీల వాస్తవ విలువ ఏమిటని ఆయన ప్రశ్నించారు. వస్తువులు, కరెన్సీలకు ఒక విలువ ఉంటుందని, దాన్ని సమర్థించే కారణాలు ఉంటాయని అన్నారు. మరి క్రిప్టోకు ఉన్న విలువ ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. క్రిప్టోను కమాడిటీగా భావిస్తారా లేదా కరెన్సీగా భావిస్తారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టోల మైనింగ్ భారత్లో ప్రారంభమైతే.. దాన్ని ఎలా పరిగణిస్తారని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్పై దీని ప్రభావం ఉంటుంది కదా అని ఆయన ప్రశ్నించారు.