For Money

Business News

ప్చ్‌… ఏథర్‌ ఎనర్జి ఐపీఓ

ఈవీ తయారీ కంపెనీ ఏథర్‌ ఎనర్జి పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన కన్పించడం లేదు. చూస్తుంటే ఈ ఇష్యూ బొటాబొటిన సబ్‌స్క్రయిబ్‌ అయ్యే ఛాన్స్‌ కన్పిస్తోంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ నేడు ముగియనుంది. రెండో రోజూ ఐపీఓకు నిరాశే మిగిలింది. ఒక్క రీటైల్‌ విభాగం మినహా ఇతర విభాగాల నుంచి పెద్దగా ఆసక్తి కన్పించలేదు. మొత్తం ఆఫర్‌ నిన్నటి కేవలం 30 శాతమే సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఒక్క రీటైల్‌ విభాగం మాత్రమే 1.2 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయింది.
రూ. 2,981 కోట్ల విలువైన షేర్లను ఈ ఆఫర్‌ కింద ఏథర్‌ ఎనర్జి జారీ చేస్తోంది. మరి ఇవాళ సబ్‌స్క్రప్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.