For Money

Business News

కొనసాగుతున్న పెట్రో బాదుడు..

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న బాదుడుకు విరామం ఇచ్చిన చమురు సంస్ధలు శనివారం మరో మారు ఇంధన ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.61, లీటర్ డీజిల్ ధర రూ.93.87కు చేరింది. ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.117.57, రూ. 101.79గా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.32, డీజిల్ ధర రూ.102.45కు చేరింది.