For Money

Business News

కొనసాగుతున్న ‘పెట్రో’ బాదుడు

దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. చమురు సంస్థలు వరుసగా రెండో రోజు పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు చొప్పున వడ్డించాయి. దీంతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.19, లీటర్ డీజిల్ ధర రూ.94.92కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 112.11, డీజిల్ ధర 102.89గా ఉంది. దేశంలోనే అత్యధికంగా గంగానగర్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.118.23, డీజిల్‌ ధర రూ.109.04గా ఉంది.