For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. దీంతో పెట్రోల్‌ రేటు రూ. 9.5, డీజిల్‌ ధర రూ. 7 చొప్పున తగ్గనుందని ఆమె చెప్పారు. దీనివల్ల ఏడాదికి ప్రభుత్వంపై లక్ష కోట్ల భారం పడుతుందని ఆమె తెలిపారు. వెంటనే రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని ఆమె కోరారు. ముఖ్యంగా ఇంతకుమునుపు వ్యాట్‌ తగ్గించని రాష్ట్రలు ముందుకు వచ్చి ఇదే స్థాయిలో ధరలు తగ్గించమని కోరారు.