For Money

Business News

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు రోజులు విరామం తర్వాత చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35పైసలు వడ్డించాయి. దీంతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.79, లీటర్ డీజిల్ ధర రూ. 93.52, ముంబైలో ధరల పెరుగుదలలో తేడా ఉంది.పెట్రోల్ 34పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.75, డీజిల్‌ పై 37 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.101.40లకు చేరింది. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ.105.44, డీజిల్ రూ. 96.63గా ఉంది. చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 102.10, రూ. 97.93కు చేరాయి.