For Money

Business News

సెంచరీకి చేరువలో డీజిల్‌..

సామాన్యడిపై పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన కొనసాగుతూనే ఉంది. ఎనిమిది రోజుల్లో ఏడు సార్లు చమురు సంస్ధలు పెంచాయి. తాజాగా మంగళవారం ఉదయం పెట్రోల్‌పై 80పైసలు, డిజిల్‌పై 70 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ధర రూ.100.24, డీజిల్ లీటర్ ధర రూ.91.47కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 85 పైసలు, డీజిల్‌పై 75 పైసలు వడ్డించారు. పెట్రోల్ లీటర్ ధర రూ.115. 04, డీజిల్ లీటర్ ధర రూ.99.25గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెరిగాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్ ధరలు రూ. 113.61, రూ.99.83గా ఉన్నాయి.